logo

వై ఎస్ ర్ సి పి లో చేరికలు

*సంక్షేమం, అభివృద్ధి చూసే వైఎస్ఆర్ సిపి లో చేరికలు...*

*పలువురు మైనారిటీ నాయకులు వైఎస్ఆర్ సిపిలో చేరిక...*

*కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డి లు...*

రాయచోటి పట్టణానికి చెందిన జనసేన ఇంచార్జి బాణం బీడీ యజమాని హసన్ బాష,మైనారిటీ టి డి పి నాయకులుబంగ్లా బషీర్, ఆయిల్ మిల్ సలావుద్దీన్ లు
మరియు వారి అనుచర వర్గం ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి,మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డి ల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికికండువాలు కప్పి పార్టీలోకి శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి లు ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగిన విలువ గుర్తింపు ఇస్తామన్నారు.


*సంక్షేమం, అభివృద్ధి చూసే వైఎస్ఆర్ సిపి లో చేరాం...*

జగన్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి చూసివైఎస్ఆర్ సిపి లో చేరామని నూతనంగా పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.వైఎస్ఆర్ సిపి ఎంఎల్ఏ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి,ఎంపీ అభ్యర్థి పి వి మిథున్ రెడ్డి ల గెలుపునకు సమిష్టి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, జెడ్ పి మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఆలీ నవాజ్ ఖాన్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తబ్రేజ్ ఖాన్ ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లా,మాజీ కో ఆప్షన్ జాఫర్ అలీ ఖాన్,
తదితరులు పాల్గొన్నారు.

15
1814 views